కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోదీ, యోగిని చంపేస్తా.. కర్ణాటక వ్యక్తి వార్నింగ్
- సెల్ఫీ వీడియోలో హెచ్చరికలు జారీచేసిన మొహమ్మద్ రసూల్
- చేతిలో పదునైన ఆయుధం పట్టుకుని దుర్భాషలు
- నిందితుడుని హైదరాబాద్లో దినసరి కూలీగా గుర్తించిన పోలీసులు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఫేస్బుక్లో షేర్ చేసిన ఆ వీడియోలో అతడు మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోదీ, సీఎం యోగిని చంపేస్తానని తీవ్రంగా హెచ్చరించాడు. అతడి చేతిలో పదునైన ఆయుధం ఉండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అది సెల్ఫీ వీడియో అని, నిందితుడు ఆ వీడియోలో మోదీ, ఆదిత్యనాథ్ను దుర్భాషలాడాడని పోలీసులు తెలిపారు. కాగా, రసూల్ హైదరాబాద్లో దినసరి కూలీగా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.