Srisailam: శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు ఓ గుడ్ న్యూస్!

  • ఈ నెల 1 నుంచి 11వ తేదీ వరకు రాత్రి వేళల్లోనూ శ్రీశైలానికి వాహనాల రాకపోకలకు అనుమతి
  • మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అటవీ శాఖ నిర్ణయం
  • రాత్రివేళల్లో వాహనాలను నెమ్మదిగా నడపాలని అధికారుల సూచన
  • నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
Vehicles allowed during night time in Srisailam due to bramotsavams

శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు ఓ గుడ్ న్యూస్. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి వేళ కూడా భక్తుల వాహనాలను అనుమతిస్తున్నట్టు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వెళ్లే భక్తులను ఈ నెల 1 నుంచి 11వ తేదీ వరకు రాత్రి వేళల్లో కూడా అనుమతిస్తున్నట్టు తెలిపారు. 

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం..పెద్దదోర్నాల-శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. పెద్దదోర్నాల అటవీ శాఖ చెక్‌పోస్ట్ వద్దే వాహనాలను ఆపేస్తారు. అయితే, బ్రహ్మోత్సవాల కోసం వచ్చే భక్తుల కోసం తాజాగా ఈ నిబంధనకు తాత్కాలిక సడలింపు ఇచ్చారు. వాహనదారులు వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా, నిదానంగా వాహనాలను నడపాలని దోర్నాల క్షేత్రాధికారి సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.

More Telugu News