అత్యాచార బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు వైద్యుల సాహసోపేత నిర్ణయం
- రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో యువతిపై ముగ్గురు యువకుల లైంగికదాడి
- ఆపై పదునైన ఆయుధంతో దాడిచేసి కాల్పులు
- శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడుతుండడంతో ట్రాకియోస్టమీ చేయాలని నిర్ణయం
- చీరుకుపోయిన పొట్టకు విజయవంతంగా ఆపరేషన్
జైపూర్ జిల్లాలో శనివారం కోట్పుత్లి-బెహ్రార్లో ఓ యువతిపై ముగ్గురు యువకులు దాడిచేశారు. ఆపై ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యారు. వెళ్తూవెళ్తూ పదునైన ఆయుధంతో దాడిచేశారు. దీంతో ఆమె పొట్ట చీరుకుపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతమైందని ప్రకటించారు. కాగా, మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్గా తేలింది. నేడు మరోమారు ఆమెకు పరీక్షలు నిర్వహించనున్నారు.