నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
- టీడీపీలోకి ఊపందుకున్న వలసలు
- వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్న నేతలు
- ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి టీడీపీలోకి సాదర ఆహ్వానం పలికిన లోకేశ్
- టీడీపీలో చేరిన విజయవాడ వైసీపీ అధ్యక్షుడు భవకుమార్
- టీడీపీ తీర్థం పుచ్చుకున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్
ఇక, విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భవకుమార్ నేడు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. భవకుమార్ కు పసుపు కండువా కప్పిన లోకేశ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు.
అంతేకాదు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ కూడా టీడీపీలో చేరారు. అనుచరులతో కలిసి టీడీపీలోకి వచ్చిన తుమ్మల చంద్రశేఖర్ కు లోకేశ్ సాదర స్వాగతం పలికారు.