ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్
- సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమన్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్
- డీఎడ్ అభ్యర్థులు నష్టపోతున్నారని వాదనలు
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. సోమవారం అత్యవసర విచారణ జరుపుతామని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తప్పుల తడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని పిటిషనర్ ఆరోపించారు. టీచర్ పోస్టుల భర్తీలో సుప్రీంకోర్టు, ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న విజ్ఞప్తికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపడతామని వెల్లడించింది.