నరసరావుపేటలో దారుణం.. బాలికలకు మద్యం తాగించి రాత్రంతా నిర్బంధించి అఘాయిత్యం
- బాలికలను గదికి రప్పించి కూల్డ్రింక్లో మద్యం కలిపి తాగించిన నిందితులు
- మత్తులోకి చేరుకోగానే లైంగికదాడి
- రాత్రయినా ఇంటికి చేరుకోకపోవడంతో బాలికల కుటుంబ సభ్యులు ఆందోళన
- పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి
- అమ్మాయిలను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
- కేసు పెట్టేందుకు బాధిత కుటుంబ సభ్యుల నిరాకరణ
అక్కడ వారికి కూల్డ్రింక్లో మద్యం కలిపి వారితో తాగించారు. వారు మత్తులోకి చేరుకోగానే వారిపై ఇద్దరూ లైంగికదాడికి పాల్పడ్డారు. ఆడుకునేందుకు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన బాలికలు రాత్రి పొద్దుపోయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానిత యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో దారుణం వెలుగుచూసింది. అతడిచ్చిన సమాచారంతో గదిలో నిర్బంధించిన బాలికలను గుర్తించి రక్షించారు. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలికలను తమతో స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఈ ఘటనపై బాధిత బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనకాడినట్టు తెలుస్తోంది.