ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ
- ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్
- పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోదీతో భేటీ
- దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశం
- అనంతరం నిర్మలా సీతారామన్ ను కలిసిన సీఎం జగన్
ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంటులోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించారు.