విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం
- ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు
- చండీయాగంతో ప్రారంభం కానున్న ఉత్సవాలు
- చివరి రోజున రాజశ్యామల యాగం
- నేడు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన స్వాత్మానందేంద్ర
కాగా, శారదా పీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించారు. ఇవాళ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు.
సీఎం జగన్ కు శాలువా కప్పి సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శారదా పీఠం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా, సీఎం జగన్ వార్షికోత్సవాల చివరి రోజున విశాఖ శారదా పీఠానికి వచ్చి రాజశ్యామల యాగంలో పాల్గొంటారని తెలుస్తోంది .