ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ
- కేఆర్ఎంబీకి అప్పగించినట్లు బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్య
- కృష్ణా జలాల వాటాల్లో కేసీఆర్, జగన్ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపణ
- మనకు రావాల్సిన జలాలను జగన్ ఏపీకి తీసుకు వెళుతుంటే కేసీఆర్ సహకరించారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేఆర్ఎంబీకి తమ ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించినట్లు హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల వాటాల్లో కేసీఆర్, జగన్ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. మనకు రావాల్సిన కృష్ణా జలాలను జగన్ ఏపీకి తీసుకు వెళుతుంటే కేసీఆర్ సహకరించారన్నారు.