పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ రాజీనామా
- రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన పురోహిత్
- చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి కూడా రాజీనామా
- వ్యక్తగత కారణాలతో రాజీనామా చేస్తున్నానన్న పురోహిత్
కొంతకాలంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పురోహిత్ కు విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని హెచ్చరిస్తూ ఇటీవల భగవంత్ మాన్ కు పురోహిత్ లేఖ కూడా రాశారు. ఈ లేఖపై భగవంత్ మాన్ స్పందిస్తూ... శాంతి ప్రేమికులను గవర్నర్ బెదిరించారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు.