మలేసియా 17వ రాజుగా సుల్తాన్ ఇబ్రహీం... ఘనంగా పట్టాభిషేకం
- రాచరికం కొనసాగిస్తున్న దేశాల్లో మలేసియా ఒకటి
- 9 రాజకుటుంబాలతో మలేసియాలో ప్రత్యేక రాచరికపు వ్యవస్థ
- మలేసియా కొత్త రాజుగా నేడు పదవీప్రమాణస్వీకారం చేసిన సుల్తాన్ ఇబ్రహీం
మలేసియా రాజును స్థానిక పరిభాషలో 'యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్' అని పిలుస్తారు. మలేసియాలో తొమ్మిది రాజకుటుంబాలకు ఒక ప్రత్యేకమైన రాచరిక వ్యవస్థ ఉంది. ప్రతి ఐదేళ్లకోసారి ఈ 9 రాజకుటుంబాల అధిపతుల్లో ఒకరు వంతుల వారీగా రాజుగా పట్టాభిషిక్తులు అవుతుంటారు.
మలేసియాలో రాచరికం అలంకార ప్రాయమే అయినప్పటికీ, రాజుకు ఉండే కొన్ని విచక్షణాధికారాల ద్వారా రాజకీయ అస్థిరతను అణచివేయడం సాధ్యమవుతుంది.