Jagan: నేడు భీమిలి 'సిద్ధం' సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న జగన్

Jagan to start election campaign today in Bheemili
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. భీమిలి నియోజకవర్గం తగరపువలసలో 'సిద్ధం' పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నారు. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సభ ప్రారంభంకానుంది. 

గత సభలకు భిన్నంగా ఈ సభను నిర్వహించబోతున్నారు. సభా వేదిక మాత్రమే కాకుండా... పెద్ద ర్యాంప్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ర్యాంప్ మీద నడుచుకుంటూ కార్యకర్తల్లోకి వెళ్లి, వారితో జగన్ మమేకమవుతారు. పార్టీ కేడర్ అభిప్రాయాలను స్వయంగా తెలుసుకుంటారు. 

ఈ సభలో తన పాలనలో జరిగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని జగన్ వివరించనున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పి కొట్టాలో కేడర్ కు తెలియజేయనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే ఈ 'సిద్ధం' సభ లక్ష్యం. 

ఎన్నికలకు కేడర్ ను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా నిర్వహించబోతున్న 'సిద్ధం' సభలు భీమిలి సభతో ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ సభలను నిర్వహిస్తున్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Siddam Sabha
AP Politics

More Telugu News