ఆ నలుగురూ కలిసొచ్చినా మళ్లీ సీఎం జగనే: తమ్మినేని సీతారాం
- చంద్రబాబు, పవన్, షర్మిల, బీజేపీ కలిసి వచ్చినా వైసీపీని ఓడించలేరన్న తమ్మినేని
- సీఎంగా మూడుసార్లు చేసినా చంద్రబాబు ఏమీ చేయలేదని విమర్శ
- మరో అవకాశం ఇవ్వాలని ఎందుకు అడుగుతున్నావని ప్రశ్న
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, షర్మిల, బీజేపీ కలిసి వచ్చినా వైసీపీని ఓడించలేరని... మళ్లీ సీఎం జగనే అని తమ్మినేని చెప్పారు. చంద్రబాబుకు మూడు సార్లు సీఎంగా అవకాశమిచ్చినా ఆయన ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. మరో అవకాశం ఇవ్వాలని ఎందుకు అడుగుతున్నావు చంద్రబాబూ? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబానికి మేలు జరిగిందని భావిస్తే... తమకు మరోసారి ఓటు వేయండని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని చెప్పారు. జగన్ ఇచ్చిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.