జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించిన కొణతాల రామకృష్ణ
- 2014 నుంచి వైసీపీకి దూరంగా కొణతాల రామకృష్ణ
- ఇటీవల హైదరాబాదులో పవన్ కల్యాణ్ తో సమావేశం
- నేడు అనకాపల్లిలో తనవారితో సమావేశం
- జనసేనతో కలిసి నడవాలనుకుంటున్నట్టు వెల్లడి
చెప్పినట్టుగానే కొణతాల ఇవాళ తనవారితో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను జనసేన పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. ఏపీలో అరాచక పాలనకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని, పవన్ కల్యాణ్ ఈ దిశగా రాజీలేని పోరాటం చేస్తాడని తాను నమ్ముతున్నానని తెలిపారు. పవన్ కు ఏపీ అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందని అన్నారు.