Revanth Reddy: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రేవంత్ రెడ్డి ట్వీట్

Revanth reddy tweet on NTR vardhanthi
షార్ట్స్‌లో చూడండి
దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలుగు జాతి అస్థిత్వ పతాక... తెలుగు నేల జవసత్వ ప్రతీక... ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి... అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
ntr

More Telugu News