Dhanush: ఆంగ్లేయుల కాలంలో సాగే 'కెప్టెన్ మిల్లర్' ... ట్రైలర్ రిలీజ్

  • ధనుశ్ తాజా చిత్రంగా రూపొందిన 'కెప్టెన్ మిల్లర్'
  • తమిళంలో ఈ నెల 12వ తేదీన విడుదల 
  • ఆంగ్లేయుల కాలంలో నడిచే కథ 
  • ఈ నెల 25వ తేదీన తెలుగులో విడుదల

Captain Miller Telugu Trailer Released

తమిళంలో ధనుశ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'కెప్టెన్ మిల్లర్' సినిమా, ఈ నెల 12వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. సాధారణంగా ధనుశ్ తన సినిమాలను తమిళంతోపాటు అదే రోజున తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. కానీ ఈ సారి సంక్రాంతికి ఇక్కడ గట్టిపోటీ ఇవ్వడంతో వెనక్కి వెళ్లారు. 

ఈ నెల 25వ తేదీన ఈ సినిమా తెలుగు వెర్షన్ ను ఇక్కడ రిలీజ్ చేయనున్నారు. అందువలన ఆ దిశగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తెల్లదొరలపై 'కెప్టెన్ మిల్లర్' బృందం పోరాడటమే ప్రధానంగా ఈ ట్రైలర్ సాగింది. 

ధనుశ్ జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో శివరాజ్ కుమార్ .. సందీప్ కిషన్ .. అదితి బాలన్ .. జాక్ కొక్కైన్ .. కాళి వెంకట్ కనిపించనున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. తెలుగు నుంచి ఈ సినిమా ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందనేది చూడాలి.

More Telugu News