జర్మనీ యువ గాయనిపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు
- జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం
- రాముడ్ని స్తుతిస్తూ భక్తిగీతం ఆలపించిన జర్మనీ సింగర్ కసాండ్రా
- ఆమె పాట అందరినీ సంతోషానికి గురిచేస్తుందన్న ప్రధాని మోదీ
"యావత్ ప్రపంచం జనవరి 22 కోసం ఎదురుచూస్తోంది. జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్ మాన్ గురించి నేను గతంలో మన్ కీ బాత్ లోనూ ప్రస్తావించాను. ఇప్పుడామె ఆలపించిన ఈ కీర్తన మిమ్మల్ని చాలా సంతోషానికి గురిచేస్తుంది" అంటూ మోదీ ట్వీట్ చేశారు.
కాగా, ఈ వీడియోను గాయని కసాండ్రా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో మూడ్రోజుల కిందట పోస్టు చేయగా, నెటిజెన్ల నుంచి విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 55 వేల వీక్షణలు, 12 వేల కామెంట్లు వచ్చాయి.