హౌతీలపై అరివీర భయంకరంగా విరుచుకుపడిన అమెరికా, బ్రిటన్
- ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలను తరచూ దోచుకుంటున్న హౌతీ రెబల్స్
- యెమన్లోని 16 చోట్ల 70కి పైగా లక్ష్యాలను ధ్వంసం చేసిన అమెరికా, బ్రిటన్
- సైనికేతర సాయం అందించిన ఆస్ట్రేలియా, కెనడా, బహ్రెయిన్, నెదర్లాండ్స్
- మూల్యం చెల్లించుకోక తప్పదని హౌతీల హెచ్చరిక
మూల్యం చెల్లించుకోక తప్పదు: హౌతీ హెచ్చరిక
అమెరికా, బ్రిటన్ దాడుల్లో ఐదుగురు చనిపోయారని, మరో ఆరుగురు గాయపడినట్టు హౌతీ రెబల్స్ ప్రకటించారు. ప్రతీకార దాడులు తప్పవని అమెరికా, బ్రిటన్ దేశాలను హెచ్చరించారు. ఆ రెండు దేశాలు పెద్ద తప్పు చేశాయని, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోలేదని హౌతీ నాయకుడు మహమ్మద్ అల్ బుఖైతీ హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ నౌకలపై దాడులు కొనసాగుతాయని హౌతీ మంత్రి హుస్సేన్ అల్ ఎజ్జి తేల్చి చెప్పారు.
ఆస్ట్రేలియా సహకారం
యెమెన్లోని హౌతీ రెబల్స్ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ జరిపిన వైమానిక దాడులకు ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ కూడా సైనికేతర తోడ్పాటు అందించాయి. ఈ దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛా రవాణాను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా సిద్ధమని ప్రకటించారు.