TS High Court: తెలంగాణ కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు

  • బుద్వేల్, రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం
  • భూమిని కేటాయిస్తూ జీవో విడుదల
  • వారసత్వ కట్టడంగా పాత భవనం!
Allotment of 100 acres for construction of Telangana New High Court

తెలంగాణలో కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ శుక్రవారం జీవోను విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట్‌, బుద్వేల్‌ గ్రామ పరిధిలోని 100 ఎకరాలను న్యాయశాఖకు కేటాయిస్తున్నట్లు జీవో నెంబర్ 55లో పేర్కొంది. బుద్వేల్‌లోని 2500 ఎకరాలను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి 1966లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిలోని 100 ఎకరాలను హైకోర్టు భవనానికి కేటాయించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ స్థలంలో నూతన హైకోర్టు భవన నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు అన్నీ పాత భవనంలోనే జరుగుతాయి. ఆ తర్వాత దానిని వారసత్వ కట్టడంగా పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

More Telugu News