ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ.. ఆవేశంతో పెళ్లి బృందంపైకి కారు.. ఒకరి మృతి
- పెళ్లి కూతురిని మెట్టినింటికి పంపించి తిరిగొస్తుండగా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ
- ఆగ్రహంతో పెళ్లి బృందంపైకి కారు ఎక్కించిన వ్యక్తి
- ఓ యువతి మృతి, పలువురికి తీవ్ర గాయాలు
- మెదక్ జిల్లా చేగుంట మండలంలో విషాద ఘటన
ఈ ఘర్షణలో స్వామిని నరేందర్ నెట్టివేశాడు. కిందపడిన స్వామిని అక్కడున్న వారు పక్కకు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన నరేందర్ తన థార్ కారును తీసుకొచ్చి అక్కడ ఉన్న పెళ్లి బృందంపైకి ఎక్కించాడు. ఈ ఘటనలో రమ్య (23) అనే యువతి తీవ్రంగా గాయపడడంతో, ఆమెను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. ఇక ఉప్పు దుర్గయ్య, సుజాత, యాదగిరి, సురేష్కు తీవ్ర గాయాలయ్యాయని స్థానిక ఎస్సై హరీశ్ వెల్లడించారు. నిందితుడు నరేందర్ పరారీలో ఉన్నాడని తెలిపారు.