దొంగతనానికి గురైన చెరువు.. బీహార్లో షాకింగ్ ఘటన
- రాత్రికి రాత్రే నీళ్లు తోడేసి గుడిసెను నిర్మించిన భూమాఫియా
- ట్రక్కులతో రాత్రంతా మట్టిని నింపారని తెలిపిన స్థానికులు
- దర్భంగా జిల్లాలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటన
కాగా ఈ చెరువును చేపల పెంపకానికి, వ్యవసాయానికి నీళ్లు అందించేందుకు ఉపయోగించేవారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అక్కడ చెరువు ఉన్న ఆనవాళ్లు ఏమీ లేవని స్థానిక డీఎస్పీ కుమార్ తెలిపారు. గత 10-15 రోజుల వ్యవధిలో చెరువులో మట్టి నింపారని స్థానిక ప్రజలు చెబుతున్నారని, రాత్రి వేళల్లో ఈ పనులు జరిగేవని చెప్పారు. అయితే ఈ భూమి ఎవరిదనే దానిపై తమ వద్ద సమాచారం లేదని వివరించారు.