గురితప్పిన గుల్లేరు.. పిట్టను కొట్టబోతే వందేభారత్ రైలు అద్దాలు బద్దలు!
- వందేభారత్ రైలు అద్దాలపై దాడి కేసులో జనగామకు చెందిన హరిబాబు అరెస్ట్
- తాను కావాలని కొట్టలేదన్న నిందితుడు
- అరెస్ట్ చేసి గుల్లేరును స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టగా గుల్లేరుతో కొట్టింది హరిబాబేనని తేలింది. దీంతో నిన్న ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన నుంచి గుల్లేరును స్వాధీనం చేసుకున్నారు. తనను అరెస్ట్ చేయడంపై హరిబాబు మాట్లాడుతూ తాను రైలుకు గురిపెట్టలేదని, పిట్టను కొట్టబోతే పొరపాటున అది రైలుకు తాకిందని, ఇందులో తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చాడు.