Ayyanna Patrudu: అంబటి రాంబాబుపై అయ్యన్నపాత్రుడు సెటైరికల్ ట్వీట్

  • పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లడంపై అంబటి ఎద్దేవా
  • అంబటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అయ్యన్నపాత్రుడు
  • సీట్ పోయింది.. ట్వీట్ మిగిలింది అంటూ సెటైర్
Ayyanna Patrudu satirical tweet on Ambati Rambabu

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ పట్ల టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సెటైర్ వేశారు. పవన్ కల్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ... 'రాష్ట్రంలో ఇల్లు లేని వారు.. ఎవరి ఇంటికి ఎవరు వెళ్లినా.. చివరకు అక్కడే స్థిరపడతారు' అని వ్యాఖ్యానించారు. దీనిపై అయ్యపాత్రుడు స్పందిస్తూ... 'సీట్ పోయింది.. ట్వీట్ మిగిలింది.. అయ్యయ్యో అంబటి' అని ఎద్దేవా చేశారు.

More Telugu News