Kishan Reddy: ఎవడయ్యా హైదర్.. ఎవడికి కావాలి హైదర్?: కిషన్ రెడ్డి

We will change Hyderabad name to Bhagyanagar says Kishan Reddy
  • బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామన్న కిషన్ రెడ్డి
  • హైదరాబాద్ పేరును మార్చడంలో తప్పేముందని ప్రశ్న
  • బానిస మనస్తత్వాలతో కూడిన ప్రతి పేరును మారుస్తామని వ్యాఖ్య

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మారుస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎవడు హైదర్ అని అని ఆయన ప్రశ్నించారు. ఈ నగరానికి హైదర్ పేరు అవసరమా? అని అడిగారు. హైదర్ ఎక్కడి నుంచి వచ్చాడని, ఎవడికి కావాలి హైదర్ అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదర్ పేరు తీసేసి భాగ్యనగరంగా మారుస్తామని చెప్పారు. మద్రాస్ పేరును చెన్నైగా, బాంబేను ముంబైగా, కలకత్తాను కోల్ కతాగా, రాజ్ పథ్ ను కర్తవ్యపథ్ గా మార్చినప్పుడు హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చుకోవడంలో తప్పేందని అన్నారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే బానిస మనస్తత్వాలతో కూడిన ప్రతి ఒక్కదాని పేరును మారుస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. మేధావుల సలహాలను తీసుకుని మారుస్తామని తెలిపారు. ఆలోచనా విధానాల్లో కూడా మార్పును తీసుకొస్తామని అన్నారు. ముస్లింలు అన్ని విధాలుగా వెనుకబడ్డారని... వారి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News