mallareddy: 'బిజినెస్ మ్యాన్' సినిమా చూసి రాజకీయాల్లోకి వచ్చా: మంత్రి మల్లారెడ్డి

Minister MallaReddy Intresting comments abourt political entry
  • ‘యానిమల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంత్రి వెల్లడి
  • మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా సోమవారం జరిగిన ఈవెంట్
  • హీరో రణబీర్ కపూర్ తో పాటు హాజరైన యానిమల్ మూవీ టీమ్
మహేశ్ బాబు సినిమా ‘బిజినెస్ మ్యాన్’ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాను తాను పదిసార్లు చూసినట్లు వెల్లడించారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కొత్త సినిమా ‘యానిమల్’ డిసెంబర్ 1న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యానిమల్ టీమ్ హైదరాబాద్ కు వచ్చింది. సోమవారం మల్లారెడ్డి యూనివర్సిటీలో ‘యానిమల్’ మూవీ ప్రీరిలీజ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు రణబీర్ కపూర్ సహా యానిమల్ టీమ్ మొత్తం హాజరైంది. చీఫ్ గెస్ట్ గా తెలుగు హీరో మహేశ్ బాబు సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు.

యానిమల్ ప్రీరిలీజ్ వేడుకకు వచ్చిన అందరికీ స్వాగతం పలికిన మంత్రి మల్లారెడ్డి.. చీఫ్ గెస్ట్ మహేశ్ బాబు గురించి మాట్లాడారు. ‘మీ సినిమా బిజినెస్ మ్యాన్ పదిసార్లు చూశా. అది చూశాకే రాజకీయాల్లోకి వచ్చి ఎంపీనయ్యా’ అనడంతో సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది. ఆ తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ కావాలంటూ రణబీర్ కపూర్ కు మంత్రి సలహా ఇచ్చారు. తెలుగు వాళ్లు బాలీవుడ్, హాలీవుడ్ అన్నింటినీ ఏలేస్తారని, తెలుగు ఇండస్ట్రీలో చాలామంది స్మార్ట్ వాళ్లు ఉన్నారని చెప్పారు. రాజమౌళి, దిల్ రాజు లాంటి దిల్ ఉన్న వారు ఉన్నారని చెప్పారు. ఇక్కడి వారు స్మార్ట్ అని చెప్పడానికి రష్మికనే ఉదాహరణ అని, పుష్ప సినిమాలో అదరగొట్టిందని అన్నారు. ఈ సందర్భంగా యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవాలని కోరుకుంటున్నట్లు మల్లారెడ్డి చెప్పారు.
mallareddy
BRS Minister
Businesman
Political Entry
Mahesh Babu
animal pre release
malla reddy university

More Telugu News