హార్స్ పవర్ అంటే తెలియని వ్యక్తి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు విమర్శలు
- కాంగ్రెస్ పార్టీకి అవకాశమిచ్చి కర్ణాటక ప్రజల వలె ఆగం కావొద్దని హరీశ్ రావు హెచ్చరిక
- రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మాటలు నమ్మవద్దని హితవు
- రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో గెలిచాక అటు వైపే వెళ్లడం లేదన్న హరీశ్ రావు
మూడు గంటల కరెంట్తో మూడు ఎకరాలకు నీరు పారుతుందని రేవంత్ రెడ్డి, రైతుబంధు వృథా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి వారి మాటలు నమ్మి ఓటేస్తే అంతే సంగతులు అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే బీఆర్ఎస్ మేనిఫెస్టో వంద రెట్లు బాగుందన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కర్ణాటకలో ఉపన్యాసాలతో ఊదరగొట్టారని, అధికారంలోకి వచ్చాక అక్కడ ఏం చేయలేక అటు వైపు వెళ్లడమే మానుకున్నారని ఎద్దేవా చేశారు. వారు చెబుతున్న ఆరు గ్యారెంటీలు అమలయ్యేవి కాదన్నారు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచాక జనవరి నుంచి రేషన్ దుకాణాలలో సోనామసూరి బియ్యం ఇస్తామన్నారు.