శ్మశానంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్
- దళిత కుటుంబాలు ఆనవాయతీగా నిర్వహిస్తున్న వేడుకలో పాల్గొన్న బండి సంజయ్
- దీపావళి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంజయ్
- ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డ యువతీయువకులు
బండి సంజయ్తో ఫొటోలు దిగేందుకు అక్కడ ఉన్నవారు ఆసక్తిచూపించారు. సెల్ఫీలు తీసుకునేందుకు చాలామంది ఎగబడ్డారు. కాగా అక్కడ ఉన్నవారందరికీ బండి సంజయ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుండగా శ్మశానంలో దీపావళి వేడుకల కోసం మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లైటింగ్స్, త్రాగునీటి సౌకర్యాలను సిద్ధం చేశారు. కాగా బండి సంజయ్ తెలంగాణ అసెంబ్లీ బరిలో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మంత్రి, బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్తో ప్రధానంగా ఆయన తలపడబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కరీంనగర్ నియోజకవర్గంలో ఉద్ధృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.