సౌతాఫ్రికాతో మ్యాచ్ లో అందుకే ఆచితూచి ఆడా: కోహ్లీ
- వికెట్ కాపాడుకోవాలంటూ మెసేజ్ వచ్చిందన్న కోహ్లీ
- రికార్డు సెంచరీ విషయంలో పరుగుల వేగం తగ్గడంపై వివరణ
- ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని కొనసాగించడంపైనే దృష్టి పెట్టామని వెల్లడి
అయితే, ఆ సమయంలో జట్టు ప్రయోజనాలకు తగ్గట్లుగా ఆడానని వివరించాడు. స్కోర్ బోర్డ్ ను పరుగులెత్తించడంలో రోహిత్, అయ్యర్, జడేజా, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడగా.. కోహ్లీ కాస్త ఆచితూచి ఆడడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 121 బంతులకు 101 పరుగులు చేసి, సచిన్ రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది.