పట్టుబడిన నగదు కానుకలు అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని ఈసీ కీలక నిర్ణయం
- నామినేషన్ల ఖరారు తర్వాత ఆయా అభ్యర్థుల ఖాతాకు జమ చేయాలని ఈసీ ఆదేశాలు
- అక్రమ మద్యం, డ్రగ్స్ కట్టడికి ఆధునికంగా ఆలోచించాలని ఈసీ సూచన
- హైదరాబాద్లో అధికారులతో సమావేశమైన ఈసీ బృందం
మరోవైపు, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మ బృందం హైదరాబాద్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించింది. తనిఖీలు, స్వాధీనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పటిష్ఠ నిఘా ఉండాలని, తనిఖీలు ముమ్మరంగా జరగాలని, చెక్ పోస్టుల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్లతో ఈసీ అధికారులు వేర్వేరుగా సమావేశమయ్యారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్తోనూ సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధతపై ఆరా తీశారు. అంశాలవారీగా ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల గురించి ఆరా తీశారు.