కాళేశ్వరం భద్రత పరిశీలనకు రేపు తెలంగాణకు కేంద్రబృందం: కిషన్ రెడ్డి
- మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో డ్యాం భద్రతపై కిషన్ రెడ్డి ఆందోళన
- బ్యారేజ్ భద్రతను పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపించాలని కేంద్రమంత్రికి లేఖ
- ఆరుగురు సభ్యుల కమిటీతో కూడిన బృందం రాక
ఈ లేఖపై స్పందించిన కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించారని వెల్లడించారు. ఆరుగురు సభ్యుల కమిటీతో కూడిన ఈ బృందం ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై రేపు కాళేశ్వరం డ్యామ్ను సందర్శించనుందని తెలిపారు. కిషన్ రెడ్డి ఇటీవల కేంద్రజల వనరుల శాఖ మంత్రికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన డ్యామ్ సేఫ్టీ అథారిటీతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం రివ్యూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.