సున్నాలు కలిస్తే... పవన్ కల్యాణ్, నారా లోకేశ్ భేటీపై అంబటి రాంబాబు
- సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రి అంబటి రాంబాబు
- రాజమండ్రిలో పాత కలయికకు కొత్త రూపం అని కామెంట్
- 0+0 =0 ! అంటూ లోకేశ్, పవన్ను ఉద్దేశించి ఎద్దేవా
కాగా, టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ భేటీలో పవన్ కల్యాణ్, లోకేశ్ పాల్గొన్నారు. నవంబర్ 1న ఇరుపార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఒకటి, వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలను రక్షించాలని రెండో తీర్మానం, రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పోరాటం చేయాలని మూడో తీర్మానం చేశారు.