చంద్రబాబు రిమాండ్ ను పొడిగించిన ఏసీబీ కోర్టు
- నవంబర్ 1 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు
- జైలులో తన సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తం చేసిన చంద్రబాబు
- లిఖితపూర్వకంగా పంపించాలని సూచించిన జడ్జి
దీంతో భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా లిఖితపూర్వకంగా అందించాలని కోర్టు ఆయనకు సూచించింది. వాటిని వివరిస్తూ జైలు నుంచి లేఖ రాయాలని జడ్జి చెప్పారు. ఆ లేఖను తనకు అందజేయాలని జైలు అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో జడ్జి స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై అధికారులను ఆరా తీశారు. ఆయన మెడికల్ రిపోర్టులు కోర్టుకు అందజేయాలని ఆదేశించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.