భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఉర్రూతలూగించే సంగీత కార్యక్రమం
- అక్టోబరు 14న భారత్, పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్
- అహ్మదాబాద్ లో మ్యాచ్
- భారీగా సన్నాహాలు చేస్తున్న బీసీసీఐ
- ప్రఖ్యాత గాయకులతో మ్యూజిక్ కాన్సెర్ట్
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారీ సంగీత కచేరీ ఏర్పాటు చేస్తోంది. సుఖ్విందర్ సింగ్, శంకర్ మహదేవన్, అరిజిత్ సింగ్ వంటి గాయకులతో సంగీత కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. అక్టోబరు 14న మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సంగీత కచేరీ ఉంటుందని తెలిపింది.