Atchannaidu: లోకేశ్ వెళ్లేసరికి పురందేశ్వరి, కిషన్ రెడ్డి అప్పటికే అక్కడున్నారు: అచ్చెన్నాయుడు

Atchannaidu explains Nara Lokesh meeting with Amit Shah
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. అయితే, అమిత్ షాతో లోకేశ్ భేటీ సమయంలో అక్కడ ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉండడం చర్చనీయాంశం అయింది. 

దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చారు. అమిత్ షాను కలిసేందుకు లోకేశ్ వెళ్లేసరికి పురందేశ్వరి, కిషన్ రెడ్డి అప్పటికే అక్కడున్నారని వివరించారు. అంతేతప్ప లోకేశ్... పురందేశ్వరి, కిషన్ రెడ్డిలతో కలిసి వెళ్లి అమిత్ షాతో భేటీ కాలేదని అన్నారు. 

అమిత్ షాతో లోకేశ్ సమావేశం వెనుక ఎలాంటి ప్రణాళిక లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో వివరించేందుకే అమిత్ షాను లోకేశ్ కలిశారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Go Back to Shorts
Atchannaidu
Nara Lokesh
Amit Shah
Daggubati Purandeswari
Kishan Reddy
Delhi
TDP
BJP

More Telugu News