బీఆర్ఎస్లోకి నందికంటి శ్రీధర్.. కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్
- బేగంపేటలోని కేటీఆర్ కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న వైనం
- నందికంటి శ్రీధర్, ఆయన వెంటొచ్చిన నాయకులకు సముచిత గౌరవస్థానం కల్పిస్తామన్న కేటీఆర్
- కాంగ్రెస్లో శ్రీధర్కు అన్యాయం జరిగిందని వ్యాఖ్య
- మల్కాజిగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానన్న శ్రీధర్
కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తం, చెమట ధారపోసినా సరైన స్థానం దక్కలేదని నందికంటి శ్రీధర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్ నాయకత్వంలో ఇకపై పనిచేస్తానని చెప్పారు. మాల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావును ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీధర్ వెంట వచ్చిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.