Team India: కాసేపట్లో ఆసీస్‌తో భారత్ రెండో వన్డే.. జట్టుతో కలిసి ఇండోర్ వెళ్లని స్టార్​ పేసర్​ బుమ్రా

  • కుటుంబాన్ని చూసేందుకు ముంబై వెళ్లిన బుమ్రా
  • అతనికి స్వల్ప విరామం ఇచ్చినట్టు బీసీసీఐ ప్రకటన
  • బుమ్రా స్థానంలో జట్టులోకి ముకేశ్ కుమార్
Jasprit Bumrah did not travel with the team to Indore for the 2nd ODI

భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య కాసేపట్లో ఇండోర్‌‌లో రెండో వన్డే మొదలవనుండగా బీసీసీఐ కీలక విషయం వెల్లడించింది. ఈ మ్యాచ్‌కు భారత స్టార్ పేసర్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదని తెలిపింది. ‘రెండో వన్డే కోసం జస్ప్రీత్ బుమ్రా జట్టుతో కలిసి ఇండోర్ వెళ్లలేదు. తన కుటుంబాన్ని చూడటానికి ఇంటికి (ముంబై) వెళ్లిన బుమ్రాకు టీమ్ మేనేజ్‌మెంట్ స్వల్ప బ్రేక్ ఇచ్చింది. 

ఈ వన్డేలో బుమ్రా స్థానంలో ఫాస్ట్ బౌలర్ ముకేష్ కుమార్ జట్టులోకి వచ్చాడు. రాజ్‌కోట్‌లో జరిగే ఆఖరి వన్డేలో బుమ్రా జట్టులో చేరనున్నాడు’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొన్నది. కాగా, తొలి వన్డేలో గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి మూడు వన్డేల సిరీస్‌ను ఇండోర్‌‌లోనే కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

More Telugu News