ఢిల్లీలో గ్రీన్ క్రాకర్లకు సైతం నో చెప్పిన సుప్రీంకోర్టు
- ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంలో జోక్యానికి నిరాకరణ
- ఇప్పటికైతే అన్ని రకాల క్రాకర్లపై నిషేధం కొనసాగుతుందని స్పష్టీకరణ
- తమ ముందుకు వచ్చిన పిటిషన్ల కొట్టివేత
కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి హాజరై వాదనలు వినిపించారు. బేరియంను 2018 దీపావళి కోసం నిషేధించినట్టు వివరించారు. ఇప్పటికైతే గ్రీన్ లేదా మరొకటి అయినా అన్ని రకాల క్రాకర్లపై ఢిల్లీలో నిషేధం విధించినట్టు కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో క్రాకర్లను కాల్చిన వారిపై కేసులు పెట్టడం పరిష్కారం కాదంటూ.. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న వాటి తయారీ మూలాల్లోకి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. ఢిల్లీ సర్కారు ఇప్పటి వరకు క్రాకర్లు కాలుస్తున్నారంటూ 2,616 మంది వ్యక్తులపై కేసులు మోపింది.