Volunteer Murder: ఆదోనిలో వలంటీర్‌ను రాళ్లతో కొట్టి చంపిన దుండగులు

  • రాజీవ్‌గాంధీనగర్‌లో వలంటీర్ హరిబాబు దారుణహత్య
  • పట్టణంలో కలకలం
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు
Volunteer Killed In Adoni Kurnool District

కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ వలంటీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇక్కడ రాజీవ్‌గాంధీనగర్‌లో వలంటీర్‌ హరిబాబును దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. ఈ హత్యతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, నిందితుల అరెస్టుతో అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News