మన దేశ చరిత్రలో హైదరాబాద్ విమోచన దినోత్సవం ఒక కీలక ఘట్టం: ప్రధాని మోదీ
- నేడు హైదరాబాద్ విమోచన దినోత్సవం
- దేశ సమైక్యత కోసం చేసిన త్యాగాలను సగర్వంగా స్మరించుకుందామన్న మోదీ
- వల్లభాయ్ పటేల్ కు నివాళులు అర్పిద్దామని పిలుపు
ఈ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం హైదరాబాదులో అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకోవడం తనకెంతో సంతోషం కలిగిస్తోందని వివరించారు. ఈ మేరకు హైదరాబాదులో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న ఫొటోలను కూడా మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.