తెలంగాణ చరిత్రను బీజేపీ, బీఆర్ఎస్ హైజాక్ చేశాయి: కూనంనేని
- రైతాంగ సాయుధ పోరాటంతో బీజేపీ, బీఆర్ఎస్కు సంబంధం లేదన్న కూనంనేని సాంబశివరావు
- మతంరంగు పులిమేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం
- కమ్యూనిస్టులకు అధికారం దక్కకూడదని నాడు పటేల్తో నిజాం కుమ్మక్కయ్యాడని ఆరోపణ
- నేడు సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. మరిప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సీపీఐ ఆధ్వర్యంలో నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఏర్పాట్లను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.