చిన్నారి లక్షితను పొట్టనపెట్టుకున్న చిరుత ఇంకా చిక్కలేదా..?
- ఇప్పటివరకూ తిరుమలలో చిక్కిన నాలుగు చిరుతలు
- రెండింటికి పరీక్షలు జరపగా అవి మాన్ ఈటర్లు కావని తేలిన వైనం
- మరో రెండు చిరుతల్లో ఒకదానికి కోరలు లేకపోగా రెండోది పసికూన
- దీంతో, లక్షితను బలిగొన్న చిరుత ఇంకా చిక్కలేదని అంటున్న అధికారులు
తొలుత అలిపిరి కాలిబాటలో ఓ చిరుత బాలుడిపై దాడి చేయడంతో అధికారులు దాన్ని బోనులో బంధించారు. కొన్ని రోజుల పాటు దాన్ని జూలో సంరక్షించి ఆ తరువాత పరీక్షలు నిర్వహించకుండానే అడవిలో విడిచిపెట్టారు. ఆ తరువాత నెలరోజుల్లోనే అలిపిరి కాలిబాటలో చిన్నారి లక్షితను చిరుత బలితీసుకుంది. దీంతో, ఈ రెండు దాడుల వెనుకా ఒకే చిరుత ఉందన్న అనుమానాలు బయలుదేరాయి. ఒకసారి మనిషి మాంసం రుచిమరిగిన జంతువు వరుసదాడులు చేస్తుందని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో, మ్యాన్ఈటర్ చిరుత ఏమైందన్న ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.