నేను వస్తున్నా.. తెలుగు వారి సత్తా చూపిద్దాం: బాలకృష్ణ
- ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అంతా ఏకమవ్వాలని పిలుపు
- చంద్రబాబు అరెస్టుతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు సంతాపం
- వారి కుటుంబాలను పరామర్శించేందుకు త్వరలో యాత్ర చేస్తానని వివరణ
- గార్ధబంబున కేల అంటూ నారసింహ శతకంలోని పద్యం చదివిన బాలకృష్ణ
చంద్రబాబు అరెస్టు వార్త తెలిసి గుండెపోటుతో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆ కుటుంబాలను ఓదార్చేందుకు తాను త్వరలో యాత్ర చేపడతానని వివరించారు. అదేవిధంగా చంద్రబాబు అరెస్టును ఖండించిన ప్రతీ ఒక్కరికీ, రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా నారసింహ శతకంలోని ఓ పద్యాన్ని బాలకృష్ణ వినిపించారు. గార్దభంబున కేల కస్తూరి తిలకంబు.. అని మొదలుపెట్టి మన రాష్ట్రమునకేల ఈ సీఎం జగను.. అంటూ ముగించారు.
గార్ధభంబున కేల- కస్తూరి తిలకంబు
మర్కటంబున కేల-మలయజంబు
శార్దూలముల కేల-శర్కరాపూపంబు
సూకరంబున కేల-చూతఫలము
మార్జాలమున కేల- మల్లెపువ్వుల బంతి
గుడ్లగూబకు నేల-కుండలములు
మహిషంబున కేల- నిర్మల వస్త్రముల్
బక సంతతికి నేల-పంజరంబు
మన రాష్ట్రమునకేలా ఈ సీఎం జగను!