Chandrababu: చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు

  • ఈ రోజు మూడు గంటలకు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల భేటీకి ఏర్పాట్లు
  • భువనేశ్వరి, బ్రాహ్మణి రాలేని పరిస్థితుల్లో రేపటికి వాయిదాపడిన ములాఖత్
  • రిమాండ్ తర్వాత పరిణామాలపై ముఖ్య నేతలతో లోకేశ్ చర్చలు
Chandrababu Naidu Mulakath with family cancled

రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న నారా చంద్రబాబునాయుడుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దయింది. తొలుత ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి టీడీపీ అధినేతను కలుస్తారని భావించారు. ఈ మేరకు జైలు అధికారులకు కూడా సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

అయితే భువనేశ్వరి, బ్రాహ్మణి ఈ రోజు 3 గంటల వరకు రాలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ములాఖత్ రేపు మధ్యాహ్నానికి వాయిదా పడిందని తెలుస్తోంది. కాగా నారా లోకేశ్ తన బస్సులో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. రిమాండ్ తర్వాత పరిణామాలపై ఆయన నేతలతో చర్చిస్తున్నారు.

More Telugu News