కుమారస్వామికి అస్వస్థత.. బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స

Karnataka Ex CM Kumaraswamy admitted in hospital
  • జ్వరంతో బాధపడుతున్న కుమారస్వామి
  • ఇప్పటికే ఆయనకు ఒక మేజర్ సర్జరీ జరిగిన వైనం
  • తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. గత వారం కుమారస్వామి ఊపిరిసలపనంత బిజీగా గడిపారు. వరుసగా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి హీరోగా చిత్రాన్ని నిర్మించనున్నట్టు స్వామి ప్రకటించారు. 

మరోవైపు ఇప్పటికే కుమారస్వామికి ఒక మేజర్ సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ వర్కర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు, కుమారస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు. 

Go Back to Shorts
Kumaraswamy
JDS
Ill
Karnataka

More Telugu News