Vishal: 'మార్క్ ఆంటోని' ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: హీరో విశాల్

  • 'మార్క్ ఆంటోని'గా విశాల్
  • ఇది పీరియాడిక్ మూవీ అంటూ వెల్లడి
  • కీలమైన పాత్రలో ఎస్. జె. సూర్య  
  • సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాశ్ కుమార్

Hero Vishal Interview

ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం దక్కించుకున్న హీరో విశాల్. ఈ రోజున ఆయన పుట్టినరోజు. త్వరలోనే ఆయన 'మార్క్ ఆంటోని' అనే సినిమాతో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా రాబోతున్న తన కొత్త సినిమా గురించిన సంగతులను ఆయన ప్రత్యేకంగా వివరించారు. 

''ఈ బర్త్ డే నాకెంతో స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే రానున్న సెప్టెంబర్ 15న 'మార్క్ ఆంటోని' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇప్పటివరకూ నేను ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ వచ్చాను. ఆడియన్స్ నన్ను ఎప్పటికీ ఆదరిస్తూనే వచ్చారు. వారు అందించిన ఆదరాభిమానాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రేక్షకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అన్నారు. 

'మార్క్ ఆంటోని' విషయానికి వస్తే నా కెరీర్లో ఇది ఎంతో ముఖ్యమైన సినిమా. పీరియాడిక్ మూవీ. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఇందులో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాను. ఆ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ కి కూడా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఓ కీలకమైన పాత్రలో ఎస్.జె.సూర్యగారు నటించారు. జి.వి.ప్రకాష్ గారు సంగీతాన్ని అందిస్తున్నారు.

థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులు నా నుంచి ఎలాంటి సినిమాను చూడాలనుకుంటున్నారో అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. తప్పకుండా ఆడియెన్స్ కి ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ను 'మార్క్ ఆంటోని' మూవీ ఇస్తుంది. మీ ప్రేమాభిమానాలుంటే ఇలాంటి సినిమాలను ఇంకా మరెన్నింటినో చేసి మిమ్మల్ని మరింతగా అలరిస్తాను" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News