ఎంపీ ధర్మపురి అర్వింద్ పై ఈసీకి ఫిర్యాదు
- ఇటీవల నిజామాబాద్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ
- ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా చివరికి తానే గెలుస్తానన్న అర్వింద్
- ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు
ఎన్నికల్లో గెలిచేందుకు అర్వింద్ దొంగ దారులు వెతుక్కొంటున్నారని భరత్ గుప్తా మండిపడ్డారు. అర్వింద్ వ్యాఖ్యలు ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు కలిగించేలా ఉన్నాయన్నారు. ఎంపీ అర్వింద్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జమాతే ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు హఫీజ్ లాయక్ఖాన్, నాంపల్లి కోర్టుకు చెందిన న్యాయవాదులు కూడా రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.