మీర్పేటలో బాలికపై లైంగికదాడి కేసు.. నిందితులందరూ అరెస్ట్
- ఇంట్లోకి దూసుకెళ్లి బాలికపై సామూహిక అత్యాచారం
- 24 గంటల్లోనే నిందితులకు సంకెళ్లు
- ప్రధాన నిందితుడిపై ఇప్పటికే 26 కేసులు
ఆ సమయంలో బాలికతోపాటు ఆమె ఇద్దరు తమ్ముళ్లు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇంట్లోకి వచ్చీ రావడమే బాలికను బెడ్రూంలోకి ఈడ్చుకెళ్లి కత్తితో బెదిరించి అబెద్ బిన్, తహసీన్, మహేశ్ లైంగికదాడికి పాల్పడ్డారు. మిగతావారు ఆమె తమ్ముళ్లను బెదిరించి దూరంగా పంపించేశారు. విషయాన్ని బాలిక తన సోదరికి చెప్పింది. అందరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరితగతిన స్పందించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. కర్ణాటకలోని ఉమ్నాబాద్ వద్ద కొందరిని, హైదరాబాద్లో మరికొందరిని అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురు నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేశామని, వారందరికీ కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన అబేద్ బిన్ ఖలేద్(35)పై హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దొంగతనాలు సహా 26 కేసులు నమోదై ఉన్నట్టు పేర్కొన్నారు.