సీఎం జగన్ ను కలిసి ఆశీస్సులు అందుకున్న నూతన ఎమ్మెల్సీలు కుంభా రవి, పద్మశ్రీ
- గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కుంభా రవి, పద్మశ్రీ నియామకం
- నేడు పదవీ ప్రమాణ స్వీకారం
- ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ మోషేన్ రాజు
- శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
నూతన ఎమ్మెల్సీలుగా పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఆశీస్సులు అందుకున్నారు. వారిరువురికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.