Delhi Ordinance bill: ఢిల్లీ అధికారాల ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా.. విపక్షాల ఆందోళన

  • బిల్లు చట్టరూపం దాలిస్తే ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర
  • అధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్రానిదే పెత్తనం
  • బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేజ్రీవాల్
Amit Shah introduced Delhi Ordinance bill in Lok Sabha

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసే ఢిల్లీ అధికారాల ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాస్ అయితే ఢిల్లీలోని అధికారులపై పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది. అధికారుల నియామకాలు, బదిలీల అంశం కేంద్రం నియంత్రణలోకి వెళ్తుంది. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు.

 ఈ బిల్లును ఆప్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విపక్ష ఇండియా కూటమి పార్టీలు కేజ్రీవాల్ కు అండగా నిలిచాయి. బిల్లును అమిత్ షా సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల వరకు సభను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. 

More Telugu News