Chiranjeevi: నా సన్మాన సభకు వచ్చినట్టుంది: చిరంజీవి

  • హిట్ టాక్ తో దూసుకుపోతున్న బేబీ
  • హైదరాబాదులో విజయోత్సవ సభ
  • ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి
  • అభిమానులు ఎదిగితే తనకంటే సంతోషించేవారుండని వెల్లడి
Chiranjeevi attends Baby success meet in Hyderabad

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయిరాజేశ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బేబీ. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన బేబీ చిత్రబృందం హైదరాబాద్ లో విజయోత్సవ వేడుక జరుపుకుంది. 

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ, ఈ వాతావరణం చూస్తుంటే బేబీ విజయోత్సవ సభకు వచ్చినట్టుగా లేదని, తన సన్మాన సభకు వచ్చినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం తన జీవితంలో అనేక మధుర ఘట్టాలు చోటుచేసుకున్నాయని, ఓ వైపు పుత్రోత్సాహం, మరోవైపు తోబుట్టువుల అభివృద్ధి, ఇంకోవైపు మేనల్లుళ్ల ఎదుగుదల, మిత్రులు అభివృద్ది చెందడం చూస్తుంటే ఆ ఆనందం వర్ణనాతీతం అని పేర్కొన్నారు. 

అభిమానులు నాకు దేవుడు ఇచ్చిన తమ్ముళ్లు అనుకుంటాను... వీళ్లలో అనేకమంది నన్ను ప్రేరణగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చి విజయాలు సాధిస్తూ తమకంటూ ఓ స్థానం ఏర్పరచుకుంటున్నారని వివరించారు. బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయిరాజేశ్ ఇలాంటివాళ్లేనని, వాళ్లు తనకు ఎప్పటి నుంచో తెలుసని చిరంజీవి అన్నారు. 

అభిమానుల ప్రయత్నం ఇంత విజయవంతం అయినందుకు అభినందించాలనే ఈ కార్యక్రమానికి వచ్చానని చిరంజీవి తెలిపారు. అభిమానులు ఓ మెట్టు ఎదిగితే తనకంటే సంతోషించేవారు ఇంకెవరూ ఉండరని చిరంజీవి భావోద్వేగభరితంగా చెప్పారు.

More Telugu News